ఎక్స్పోజింగ్ చేయడం నా దృష్టిలో తప్పు కాదు-యాంకర్ రష్మీ గౌతమ్


ఈటీవీలో ప్రతి గురువారం మరియు శుక్రవారం ప్రసారమైయ్యే జబర్ధస్ కామెడీ కార్యక్రం తెలుగులో ఎంత పాపులర్ అని చెప్పాలిసిన అవసరం లేదు. ఈ కార్యక్రమం మొదట్లో ఒక్క అనుసయనే యాంకర్ గా వ్యవహరించింది. తరువాత ఎక్సట్రా జబర్డస్ట్ తో ఈ షోకి వచ్చింది యాంకర్ రష్మీ గౌతమ్. రష్మీ తనుకు వచ్చి రాని తెలుగుతో తన అండ చందాలతో ఈ కార్యక్రమానికి ఒక వెలుగు తీసుకొచ్చింది. ఆ తరువాత ఈ బ్యూటీ కొన్ని తెలుగు సినిమాలలో తన అంద చందాలతో యువతని మురిపింప చేసింది. 

 ఈ మధ్యనే రష్మీ ఒక ప్రముఖ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్నపుడు అంతా చూసేది కేవలం డబ్బుల కోసమే అని ఘాటుగా మాట్లాడింది. చాలా కొందరు మాత్రమే ఇక్కడ క్రియేటివ్ శాటిస్ఫాక్షన్ కోసం పని చేస్తుంటారు. కానీ వందలో తొంభైశాతం మంది మాత్రం కచ్చితంగా డబ్బే ప్రధానంగా ఈ ఇండుస్ట్రీ లో పనిచేస్తువుంటారు .తనకు ఇంతవరుకు తన మనసుకు నచ్చి తనను తాను నిరూపించుకునే ఛాలెంజింగ్ పాత్రలు ఎవ్వరూ ఇవ్వలేదని ఈ  యాంకర్ చెప్పుకొచ్చిది . అందుకే డబ్బు సంపాదించడమే తన లక్ష్యంగా ముందుకెళ్తున్నానని సంచలన సమాధానం చెబుతుంది ఈ ఏంకరు ఇప్పుడు.

 ఇప్పటి వరకు తనకు ఒక్క తెలుగు దర్శకుడు కూడా ఛాలెంజింగ్ రోల్ గాని నటనకు ఆస్కారం ఉన్న పాత్ర గాని ఇవ్వలేదని  చెబుతుంది ఈ బ్యూటీ. కేవలం తనను గ్లామర్ డాల్ గానే దర్శకులు చూస్తున్నారని తను కూడా డబ్బు వస్తుంది కాబట్టి అలాంటి పాత్రలే చేస్తున్నాననంటుంది రష్మీ. తాను కూడా మంచి మంచి పాత్రలు చేయాలని ఉంటుందని కానీ అలా రాకపోతే ఏం చేస్తానని ప్రశ్నిస్తుంది ఈ ఏంకరు . అందుకే తాను బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకొంటూ వస్తున్నాను అని అంటుంది రష్మీ.

 అయినా డబ్బులు వచ్చినపుడు ఎక్స్ పోజింగ్ చేయడం తప్పేమీ కాదంటుంది రష్మీ గౌతమ్. అప్పుడప్పుడూ డబ్బుల కోసమే కాకుండా క్రియేటివ్ సైడ్ కూడా పని చేయాలని అనిపిస్తుందని, అందుకే వెబ్ సిరీస్ చేయడానికి ఆలోచిస్తున్నట్లు తన మనసులోని మాట చెప్పింది ఈ జబర్దస్త్ యాంకర్. త్వరలోనే ఇది చేస్తానని కూడా చెప్పింది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికి ఈ ఇండస్ట్రీలో తాను ఉన్నది మాత్రం డబ్బుల కోసమే అని కుండ బద్ధలు కొట్టేసింది యాంకర్ రష్మీ గౌతమ్. అయినా ఇలా నిజాయితీగా ఉన్నదున్నట్లు చెప్పేవాళ్లు కూడా ఎంతమంది ఉంటారు కదా...

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please do not enter any spam link in the comment box

కొత్తది పాతది

نموذج الاتصال