భల్లాల దేవా ఆగ్రహం .....ట్వీట్ డిలీట్......


టాలీవుడ్ నటుడు  రానా గత కొంత కాలంగా అమెరికాలో ఉంటున్నారు. ఆయన ఆరోగ్య సమస్యల వల్ల అమెరికా లో ట్రీట్మెంట్ కోసం వెళ్లాడని వార్తలు వచ్చాయి. రీసెంట్ గా ఆయన ఒక ఫోటో వైరల్ గా మారింది. ఫోటో లో ఆయన చాలా సన్నగా అయ్యారు. రానా   ఆదివారం  ఇండియాకి వచ్చినట్టు ట్వీట్టర్ వేదిక గా తెలిపారు.
 
రానా ప్రస్తుతం " హౌస్ ఫుల్ 4 " అనే బాలీవుడ్  సినిమాలో  విలన్ గా నటిస్తున్నారు.  రీసెంట్ గా విడుదలైన " హౌస్ ఫుల్ 4 " ట్రైలర్ కు  మంచి స్పందన వచ్చింది. ట్రైలర్ లో రానా ఒక తోడేలు తో ఫైట్ చేస్తూ కనిపించి అందరిని ఆశ్చర్యపరిచారు. సినిమా లో  అక్షయ్ కుమార్, రితేష్ దేశ్ ముఖ్ , పూజా హెగ్డే, కృతి సనన్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.  సినిమా కి ఫర్హాద్  దర్శకత్వం వహిస్తున్నారు.

  ఇంతకీ విషయం ఏమిటి అంటే ఆంగ్ల పత్రిక రానా పై ఒక వార్త వ్రాసింది , వార్త  ఆయనకు ఆగ్రహాన్ని తెచ్చింది .  విషయానికొస్తే " హౌస్ ఫుల్ 4 " సినిమా కొంత భాగం షూటింగ్ లండన్ లో జరిగింది. లండన్ షెడ్యూల్ కి రానా తన కుక్ ని  తీసుకు వెళ్లడని. రానా ఏలాంటి భోజనం తింటాడో , ఏలాంటి డైట్ ఫాలో అవుతాడో  తన కుక్ కి  బాగా తెలుసని. లండన్ లో  రానా  బస చేసిన హోటల్లో  రానా కోసం ప్రత్యేకంగా తన కుక్ వంటకాలు  తయారు చేసేవాడని రాసింది. విషయాన్ని ట్వీట్ కూడా చేసింది.

  విషయం పై రానా గట్టిగా స్పందించారు." నేను లండన్ లో జరిగిన షూటింగ్ షెడ్యూల్ లో నేను పాల్గొనలేదు. మీరు ఇలాంటి వార్తలు ఎలా రాస్తారు" అని రానా పత్రిక ఫై నా  కొప్పడ్డారు. దీంతో సదరు ఆంగ్ల పత్రిక తన  ట్వీట్ ను డిలీట్ చేసింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please do not enter any spam link in the comment box

కొత్తది పాతది

نموذج الاتصال