రజినీకాంత్ దారిలో పవన్ కళ్యాణ్ !

సినీ నటి నటులు.. సెలబ్రిటీలు.. రాజకీయవేత్తలు   తర్వాత.. చిన్నసైజు రాజకీయ నేత సైతం తాను ఎక్కడికి వెళ్లిన ఆ  ప్రాంతంలో తన హంగుకు తగ్గట్లుగా ఉండాలని కోరుకోవటం.. లగ్జరీ విషయంలో ఏ మాత్రం రాజీ పడటం అన్నది ఉండదు. అందుకు భిన్నంగా మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరు ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మరి సోషల్ మీడియాలో హుల్ చల్ చేస్తుంది .

సాధారణ ప్రజల మాదిరి అత్యంత సామాన్యంగా ఉండే నటి నటులు మరియు ప్రముఖులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి కోవకే వస్తారు రజినీ కాంత్ ,పవన్ కల్యాణ్. పవర్ స్టార్ గా,స్టైలిష్ స్టార్ గా ప్రజల గుండెల్లో నిలిచియున్న ఆయనకున్న ఇమేజ్ అంతా ఇంతా కాదు. రీల్ లైఫ్ లో ట్రెండ్ కు కేరాఫ్ అడ్రస్ గా వుండే  పవన్.. రియల్ లైఫ్ లో మాత్రం అందుకు భిన్నంగా సాదాసీదాగా జీవించడం మనం చూస్తున్నాం.

ప్రస్తుతం వెన్నునొప్పి సమస్యతో సతమతమవుతున్న పవన్.. ఆయుర్వేద  వైద్యం కోసం ఉత్తరాదికి వెళ్లటం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఆయన హరిద్వార్ లో ఉన్నారు. అక్కడ ఆయన బస చేసిన హోటల్ రూం చూస్తే మనం అవాక్కు అవ్వాల్సిందే. హరిద్వార్ లో ఆయన పవన్ ధామ్ అనే ఆశ్రమంలో బస చేశారు.

ఒక రాజకీయ ప్రముఖుడైనప్పటికీ సాదాసీదాగా జీవితాన్ని ఇష్టపడే వ్యక్తిగా పవన్ కళ్యాణకి కు ఉన్న పేరును మరింత భలం పెంచేలా ఆయన బస చేసిన హోటల్ గది ఉండటం కనిపిస్తుంది. సాదాసీదా ఏసీ కూడా లేని గదిలో ఆయన ఉన్న వైనం చూస్తే.. నిజ జీవితంలో ఇంత సింఫుల్ గా ఉండటం పవన్ కళ్యానికి మరియు సౌత్ సూపర్ స్టార్ రజినీకాంతి కి మాత్రమే సాధ్యమని చెప్పక తప్పదు. గంగా నది ప్రక్షాళన అంశంపై ప్రత్యేకంగా పరిశీలిస్తున్న పవన్ కళ్యాణ్ .. తన పర్యటనను చాలా సింఫుల్ లైఫ్ స్టైల్ లో ఉండటం చూస్తే మనం అందరూ అవాక్కు అవ్వాల్సిందే.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please do not enter any spam link in the comment box

కొత్తది పాతది

نموذج الاتصال