Deepavali Festival Which Mantras to be Chanted( దీపావళి పండుగ నాడు ఏ ఏ మంత్రాలను జపించాలి )


మన హిందూ పురాణాల ప్రకారం దేవతా మంత్రాలకు అపారమైన శక్తి ఉంది. మంత్రాలను జపించడం వల్ల  అపరమితమైన ఆధ్యాత్మిక శక్తి లభిస్తుంది. సరైన పద్ధతిలో వీటిని  సరిగ్గా ఉచ్ఛరిస్తే మనలో దైవత్వ ప్రకంపనలు సిద్ధిస్తాయి. విశ్వంలోని ప్రకంపనలు మనకు మానసిక ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తాయి. వీటిలో ముఖ్యమైంది లక్ష్మీ మంత్రం. దీన్ని సిద్ధి మంత్రం అని కూడా అంటారు. మంత్రల్లో ప్రతి అక్షరం అత్యంత శక్తివంతమైంది. మనస్ఫూర్తిగా ,నిష్టగా వీటిని జపిస్తే అనుకూల ఫలితాలు లభిస్తాయి. జీవితంలో ఎదురయ్యే ఆర్ధిక ఆటంకాలు తొలగిపోయి విజయాలు దరిచేరుతాయి. అయితే దీపావళి రోజున కొన్ని ప్రత్యేక మంత్రాలను ఉచ్ఛరిస్ మన కోరికలు త్వరగా నెరవేరుతాయి .

ఓం శ్రీం మహాలక్ష్మీయే నమ: మంత్రాన్ని108 సార్లు నిష్ఠగా పఠించడం వల్ల ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి.
 ఓం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మీయే నమ: మంత్రాన్ని108 సార్లు ఉచ్చరించడం వల్ల అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధిస్తారు.
ఓం శ్రీం శ్రీ అయే నమ: మంత్రాన్ని 108 సార్లు పలకడం వల్ల మానసిక సంతోషం లభిస్తుంది.
ఓం మహాదేవ్యేచ విద్మహే, విష్ణు పత్నేచ దీమహే... తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అనేది లక్ష్మీ గాయత్రి మంత్రం. మంత్రం జపించడం వల్ల ఆధ్యాత్మికంగా వృద్ధి చెందుతారు.అలాగే
శ్రీంగ్ హ్రింగ్ క్లీంగ్ ఐంగ్ సంగ్
హ్రింగ్ కా లే... హ్రింగ్ హసా కా హ్రింగ్ సకల్... హ్రింగ్ సౌంగ్ ఐంగ్, క్లీంగ్ హ్రింగ్ శ్రీంగ్ ఓం అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార, ధన వస్తు లాభం,కుటుంబవృద్ధి ,మానసిక, శారీరక అనారోగ్యాలు సమసిపోతాయి. అలాగే వైవాహిక జీవితంలో ఇబ్బందులు తొలగిపోతాయి.అలాగే దీపావళి రోజున శ్రీ మహాలక్ష్మీకి కోటి కుంకుమార్చన, శ్రీ మహా లక్ష్మీకి 108 కలువ పువ్వులతో పూజలు చేస్తే ఇంటి ఇల్లాలికి అఖండ సౌభాగ్యం ,మహా పుణ్యం చేకురుతాయని వేదాలు గోషిస్తున్నాయి . మన పూజ గదిలో గానీ, ఆలయంలో గానీ కూర్చుని వీటిని నిష్ఠగా జపించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please do not enter any spam link in the comment box

కొత్తది పాతది

نموذج الاتصال