కరోనా
లాక్ డౌన్ వేళ టెక్నాలజీ పెరిగిపోయింది. అంతా ఇంట్లోనే వుండడంతో డేటా వినియోగం ఎక్కువయింది. సోషల్ మీడియా యాప్స్ కూడా బాగా వాడుతున్నారు. ఫేస్బుక్ తాజాగా భారత్లో మరో కొత్త సర్వీస్ ప్రారంభించింది. పిల్లల కోసం ఉద్దేశించిన మెసెంజర్ కిడ్స్ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం యాపిల్ యాప్ స్టోర్ నుంచి దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చని, ఈ వారాంతంలో గూగుల్ ప్లే స్టోర్లో కూడా అందుబాటులోకి తెస్తామని ఫేస్బుక్ వెల్లడించింది. తల్లిదండ్రుల పర్యవేక్షణలో మెసెంజర్ యాప్ ద్వారా పిల్లలు తమ స్నేహితులతో కనెక్ట్ కావడానికి ఇది ఉపయోగపడుతుంది. కరోనా వైరస్ కట్టడికి లాక్డౌన్ కారణంగా స్కూళ్లు, కార్యాలయాలు మూతబడటంతో సమాచార మార్పిడికి డిజిటల్ ప్లాట్ఫామ్లపై ఆధారపడటం పెరుగుతోంది. దీంతో పిల్లలు కూడా స్నేహితులు, ఇతర కుటుంబ సభ్యులతో కనెక్ట్ అయ్యేందుకు మెసెంజర్ కిడ్స్ ఉపయోగపడుతుందని వివరించింది. ఈ ఫీచర్ ద్వారా పిల్లలు తమ స్నేహితులతో వివిధ విద్యాసంబంధమయిన సందేహాలు తీర్చుకోవచ్చు. కంబైన్డ్ స్టడీ తరహాలో మెసెంజర్ కిడ్స్ ఉపయోగపడుతుందని ఫేస్ బుక్ తెలిపింది. ఇప్పటికే ఫేస్ బుక్ జియోతో ఒప్పందం కుదుర్చుకుంది.
భారీగా పెట్టుబడి పెట్టనున్న సంగతి తెలిసిందే. ప్రజలకు మరింత చేరువ కావడానికి జియో మార్ట్ లు రానున్నాయి. జియో ప్లాట్ఫామ్స్, రిలయన్స్ రిటైల్, వాట్సాప్ కూడా వాణిజ్య భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆర్ఐఎల్ తెలిపింది. రిలయన్స్ రిటైల్ ఈ-కామర్స్ విభాగం జియోమార్ట్ వ్యాపార కార్యకలాపాలను వాట్సాప్ ద్వారా మరింత విస్తరించేందుకు ఇది ఉపయోగపడనుంది.
అటు చిన్న వ్యాపార సంస్థలకు కూడా ఊతమివ్వనుందని ఆర్ఐఎల్ వివరించింది. ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్కార్ట్కు దీటుగా ఎదిగేందుకు ఇది తోడ్పడనుంది. దీనికి నియంత్రణ సంస్థలపరమైన అనుమతులు త్వరలో రానున్నాయి.
భారీగా పెట్టుబడి పెట్టనున్న సంగతి తెలిసిందే. ప్రజలకు మరింత చేరువ కావడానికి జియో మార్ట్ లు రానున్నాయి. జియో ప్లాట్ఫామ్స్, రిలయన్స్ రిటైల్, వాట్సాప్ కూడా వాణిజ్య భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆర్ఐఎల్ తెలిపింది. రిలయన్స్ రిటైల్ ఈ-కామర్స్ విభాగం జియోమార్ట్ వ్యాపార కార్యకలాపాలను వాట్సాప్ ద్వారా మరింత విస్తరించేందుకు ఇది ఉపయోగపడనుంది.
అటు చిన్న వ్యాపార సంస్థలకు కూడా ఊతమివ్వనుందని ఆర్ఐఎల్ వివరించింది. ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్కార్ట్కు దీటుగా ఎదిగేందుకు ఇది తోడ్పడనుంది. దీనికి నియంత్రణ సంస్థలపరమైన అనుమతులు త్వరలో రానున్నాయి.